బాహుబలి సినిమా కోసం దాదాపు ఐదేళ్ల సమయం కేటాయించిన ప్రభాస్ ఆ తర్వాత సినిమాల స్పీడ్ పెంచాడు. ప్రభాస్ నటించిన సాహో చిత్రం విడుదలకి సిద్ధం కాగా, ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే సినిమా చేయనున్నాడు.
400 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు డేట్స్ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో ప్రాజెక్ట్ కె మొదలు కానుందని సమాచారం.
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో 2021 నవంబర్ నుంచి నటీనటులంతా పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్ట్ నాగ్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.