యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్..సలార్, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నారు.ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే చిత్రం చేయనుండగా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ కె మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణ్ హీరోయిన్గా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా చిత్ర విశేషాలను నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించారు. అమితాబ్పై పదిరోజుల పాటు కీలక సన్నివేశాలు చీత్రీకరించాం. నవంబరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని అన్నారు.
13 నెలల పాటు ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతుందని అశ్వినీదత్ తెలియజేయగా, ఈ షెడ్యూల్లో ప్రభాస్, అమితాబ్లతో పాటు మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఇప్పటికే గ్రాఫిక్స్ పనులు ప్రారంభమయ్యాయి’ అని తెలిపారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు క్రియేటిడ్గా వ్యవహరిస్తున్నారు.