యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శేఖర్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటీవ్ టాక్ను తెచ్చుకుంది. అయితే చిత్రం విడుదలైన మూడవ రోజే సినిమా ప్రదర్శనను ఆపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలను జారి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు జీవిత, రాజశేఖర్ ఇవ్వలేరని పరందామ కోర్టును ఆశ్రయించిగా.. కోర్డు ఈయనకు ఇవ్వాల్సిన డబ్బులను డిపాజిట్ చేయాలని జీవిత, రాజశేఖర్ దంపతులకు గడువు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యాయస్థానం శేఖర్ బృందానికి అనుకూలంగా స్పందించింది. కోర్టు శేఖర్ ప్రదర్శనను ఆపివేయాలని ఎప్పుడు చెప్పలేదని పేర్కొంది.
దీనిపై శేఖర్ నిర్మాత సుధాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘శేఖర్ సినిమాకు అన్యాయం చేశారని, లీగల్ డ్యాక్యుమెంట్లన్ని తన వద్దే ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ చిత్రానికి శివాని, శివాత్మికలు నిర్మాతలు కారని.. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయిని వెల్లడించాడు. సినిమాను ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదని, డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే సినిమా ఆగిపోయిందని చెప్పాడు. శేఖర్ సినిమాను డిజిటల్ ప్రొవైడర్లు చంపేశారు. ఫైనాన్షియర్ పరంధామ రెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని.. తనకు కలిగిన నష్టాన్ని పరంధామాయ్య ఇస్తాడా? డిజిటల్ ప్రొవైడర్లు ఇస్తాడా? అని అడిగాడు. అంతేకాకుండా జీవితరాజశేఖర్ వల్ల తనకు ఎలాంటి నష్టం కలగలేదని’ చెప్పుకొచ్చాడు.