Bhushan Kumar Gifts A Car To Kartik Aryan | ప్రస్తుతం బాలీవుడ్లో వినిపిస్తున్న పేరు కార్తిక్ ఆర్యన్. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్కు వన్నే తెచ్చాడు. ఈ మధ్య కాలంలో నార్త్లో దక్షిణాది సినిమాల సందడి ఎక్కువైంది. సౌత్ హీరోల ముందు బాలీవుడ్ హీరోలు నిలబడలేకపోతున్నారు. ఈ క్రమంలో కార్తిక్ ఆర్యన్ మాత్రమే సౌత్ హీరోల పోటీని తట్టుకుని నిలబడ్డాడు. ‘భుల్ భూలయా-2’ చిత్రంతో ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ చేసి బాలీవుడ్కు ఊపిరి పోశాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. 2007లో బ్లాక్బస్టర్ హిట్టయిన ‘భూల్ భూలయా’కు సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది.
టీ సిరీస్ ఫిలంస్ బ్యానర్పై భూషన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో భూషన్కుమార్, కార్తిక్కు ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్గా ఇచ్చాడు. మెక్లారెన్ జీటి(McLaren Gt) కారును బహుమతిగా ఇచ్చాడు. దీని ధర దాదాపు రూ.4.7 కోట్లు. ఇందులో మరో విశేషమేంటంటే ఇండియాలో డెలివరీ అయిన మొదటి జీటీ కారు ఇదే. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘సోను కే టిటు కీ స్వీటీ’, ‘పతి పత్నీ ఔర్ వో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. భూషన్ కుమార్కు ఈ రెండు చిత్రాలు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.