ప్రస్తుతం సినిమాకు బడ్జెట్లు పెరుగుతున్నాయి. పదేళ్ల ముందుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం వుంది. నాకు సినిమాపై పూర్తి అవగాహన వుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను కూడా బడ్జెట్ తగ్గించడానికి ప్రయత్నిస్తా. కానీ మనం అనుకున్నంత తేలిక కాదు’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. అగ్రనటుడు చిరంజీవితో ఆయన నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవితో సినిమా చేస్తానని నేను ఊహించలేదు.
నేను ఒకసారి ఆయన్ని కలిసి ‘మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నానండీ, ఫైనల్గా కలిశాను’ అన్నాను. అప్పుడు ఆయన కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం అన్నారు. ఆ సమయంలోనే నా దగ్గర కన్నడ ‘వేదాళం’ రైట్స్ వున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మెహర్ రమేష్ ‘వేదాళం’ను చిరంజీవితో రీమేక్ చేద్దాం అన్నారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. ఈ చిత్రం షూటింగ్లో నేను దాదాపు 40 రోజులు సెట్స్లో చిరంజీవితో వున్నాను. ఆయనతో నాది చాలా మెమరబుల్ జర్నీ. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. ఒక్క రోజు కూడా వృధా కాదు. ‘భోళా శంకర్’నాకు చాలా ఇష్టమైన కథ. తప్పకుండా ప్రేక్షకులందరికి కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’అన్నారు.