బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సరికొత్త టాస్కులతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సోమవారం నామినేషన్స్ చాలా డిఫరెంట్గా సాగగా, మంగళవారం రోజు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు ఇంటి సభ్యులకు నరకం చూపించాయి. 52వ ఎపిసోడ్ మొదట్లో హౌస్ కెప్టెన్ సన్నీ ఏడుస్తూ కనిపించాడు. తన తల్లి పంపించిన లెటర్ని చదువుకుని ఎమోషనల్ అయ్యాడు.
షణ్ముఖ్.. సిరికి గోరు ముద్దలు తినిపిస్తూ ముచ్చటించసాగాడు. విశ్వ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ గుసగుసలాడాడు. నామినేషన్స్ అంటే అతను భయపడతాను అనిఅనుకున్నారు. ఆ తర్వాత పింకీ.. రవి దగ్గరకు వెళ్లి శ్రీరామ్ని పెద్దబావ అని.. మానస్ని చిన్న బావ అని.. జెస్సీని బుల్లిబావ అంటూ సిగ్గ పడుతూ కనిపించింది.
ఇక బెడ్ రూంలో మానస్, సిరి, పింకీ ముచ్చటిస్తున్న సమయంలో నేను మాసస్ టాప్ 5లో ఉంటాము.. మానస్ విన్నర్ అవుతాడు నేను టాప్ 5లో ఉంటా అని సిరితో చెప్పింది ప్రియాంక. మీరు టాప్ 5లో ఉంటే మేం అడుక్కోవాలా అంటూ సిరి పంచ్ వేసింది. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోయి.. కుర్రాళ్లు మాత్రమే లోపల ఉండాలని మానస్ అనగా.. ఆంటీలు వెళితే పింకీ కూడా బయటకు పోవాలి అని సిరి చురక అంటించింది. దీంతో పింకీ నవ్వుకుంటూనే మొహం పగిలిపోద్ది అని చెప్పుకొచ్చింది.
ఇక రవి-షణ్ముఖ్ల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. వీకెండ్లో నాగ్ చెప్పిన విషయంపై షణ్ముఖ్.. రవితో తీవ్రంగా చర్చించాడు. ‘టాస్క్ల సంగతి పక్కన పెడితే.. నేను చూసినంతవరకూ.. షణ్ముఖ్ ఎక్కడ అంటే.. మోజ్ రూం విత్ త్రీ (సిరి, జెస్సీ, షణ్ముఖ్).. తప్పితే ఆన్ బెడ్ విత్ త్రీ.. నిన్న అమ్మ లెటర్ మనం చదవలేదు కానీ.. ఆమె కూడా ఇదే రాసి ఉండొచ్చు అని చెప్పాడు రవి. ఇక ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు సార్ట్ ఔట్ చేసుకొని హగ్ ఇచ్చుకున్నారు.