మోడల్గా కెరీర్ మొదలు పెట్టిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ తొలిసారి 2017లో వచ్చిన కలవరమాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా పాపులారిటీ పొందింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రియాంక రీసెంట్గా తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది.
మూడేళ్లు సినిమాలతో పలకరించని ఈ అమ్మడు ఆ సమయంలో చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నట్టు పేర్కొంది. టాక్సీవాలా విడుదలకు ముందు నుంచే ఎన్నో ఆఫర్లు వచ్చాయి. పదుల సంఖ్యలో స్క్రిప్ట్లు విన్నా ఆలా విన్న వాటిలో గమనం కథ నచ్చింది అందుకు ఓకే చెప్పాను అని పేర్కొంది. 2019లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లగా ఆ తర్వాత ఎస్.ఆర్.కల్యాణమండపం చేశాను. ఈ రెండు సినిమాలు కరోనా వలన వాయిదా పడ్డాయి అని పేర్కొంది.
రీసెంట్గా తిమ్మరసు చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. నాగుపాము లాంటి నడుముతో అందాలు ఆరబోస్తూ యూత్కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రియాంకని ఇలా చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తన శరీరంలో వచ్చిన మార్పులపై స్పందించారు. టాక్సీవాలా సినిమా తర్వాత చాలా లావుగా మారానని చెప్పిన ప్రియాంక.. దీనికి కారణం థైరాయిడ్ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం అని గుర్తించలేకపోయానని తెలిపారు.
ముఖమంతా మొటిమలు విపరీతంగా వచ్చాయని ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే తనకున్న సమస్యలన్నీ బయటపడ్డాయని తెలిపారు. వ్యాయామాలు, యోగా చేయడంతోపాటు ప్రత్యేక డైట్ తీసుకుని మళ్లీ ఇలా ఫిట్గా మారానని తన ఫిట్నెస్ సీక్రెట్ను చెప్పుకొచ్చారు ప్రియాంక.