బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పదమూడో వారం పింకీ ఎలిమినేట్ అయింది. ఊహించిన విధంగా ఆమె ఎలిమినేషన్ జరిగింది. అయితే మానస్ని వదిలి వెళ్లిపోతున్నాననే బాధతో ప్రియాంక చాలా ఎమోషనల్ అయింది. మానస్తో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని బయటకు వచ్చేసింది. నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిందని మానస్తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఏకధాటిగా ఏడ్చింది పింకీ.
బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాక నాగార్జున .. పింకీకి ఓ టాస్క్ ఇచ్చారు. ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది.. వెళ్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో చెప్పాలంటూ టాస్క్ పెట్టాడు. అలా సిరి నుంచి మొదలుపెట్టింది. సిరిని మొదటగా ఇంట్లోకి వచ్చినప్పుడు గోల్డ్ కలర్ డ్రెస్సులో చూశాను, ఇదేంటి నాకంటే అందంగా ఉందని అనుకున్నాను. సిరిని చూస్తే నా చెల్లి గుర్తుకు వస్తుంది.. ప్రతీదీ బెస్ట్ ఇస్తుంటుంది. అని సిరి గురించి చెప్పింది.
శ్రీరామచంద్ర గారు.. మొదటి రోజు వైట్ కలర్ డ్రెస్లో వచ్చారు. ఆయన పాటకు పెద్ద ఫ్యాన్.. అని చెప్పాను. అలా కనెక్ట్ అయ్యాను…ఆరోజు నుంచి ఏ రోజు కూడా అది డ్యామేజ్ అవ్వలేదు.. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడిని చేద్దామని ప్రయత్నించాను కానీ కుదర్లేదు అని ప్రియాంక చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ అన్నయ్యను ముందు తమ్ముడు అని పిలుద్దామని అనుకున్నా.. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నయ్య అని పిలిచాను.. నువ్ నాతో మాట్లాడటం లేదని నామినేట్ చేశాను.. నేను వెళ్తుంటే.. నువ్ ఏడ్చావ్ అది చాలు అంటూ ప్రియాంక ఎమోషనల్ అయింది.
సన్నీ అన్నయ్యే నన్ను ఇంట్లోకి ఆహ్వానించాడు. మొదట్లో అంతగా బాండ్ లేదు.. కానీ రాను రాను సన్నీ అన్నయ్య అంటే ఏదో ఒక ధైర్యం వచ్చింది.. ఎవ్వరితో చెప్పలేనివి నీతో చెప్పుకున్నాను అని బాధపడింది. కాజల్ను మొదటి సారి చూసినప్పుడు.. ఇంత అల్లరి చేస్తుందేంట్రా అనుకున్నాను.. కాని ఇంతే అల్లరి చేయాలని ప్రియాంక కోరింది. మానస్ను మొదటిసారి చూసినప్పుడు.. ఎవరబ్బా ఈ సిల్కీ హెయిర్ అనుకున్నాను. మొదట్లో అస్సలు మాట్లాడలేదు. ఇంత పొగరేంటని అనుకున్నాను.
కానీ మెల్లిమెల్లిగా క్లోజ్ అయ్యాం. విన్నర్గా చూడాలని అనుకుంటున్నాను.. నీ ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ కావాలి.. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.. ఇంకా నేర్చుకోవాలి.. విన్నింగ్తో బయటకు రావాలి అని ప్రియాంక చెప్పింది. తన కోసం ఓ పాట పాడమని మానస్ని ,శ్రీరామ్ని కోరింది ప్రియాంక. ప్రియాంక కోసం మానస్ తనకు ఇష్టమైన ఉప్పెనంత ప్రేమకు..అనే పాటను పాడాడు. ప్రియా ప్రియా చంపొద్దే అనే పాటను శ్రీరామచంద్ర పాడాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగిసింది.