బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో రాజు గారి గోడ అనే టాస్క్ జరుగుతున్న సమయంలో కాయిన్స్ దొంగతనం చేస్తూ కాజల్..రవికి అడ్డంగా దొరికింది. అయితే తాను దొంగించలేదని, ఆధారాలు చూపించమిని చెప్పింది. ఆమెతో వాదించలేని రవి పక్కకు వెళ్లిపోయాడు. ఈ సీన్ అంతా చూసిన అనీ మాస్టర్ ప్రోవోక్ అవార్డ్ ఉంటే కాజల్కి ఇవ్వోచ్చు అని పేర్కొంది.
ఇక బిగ్బాస్.. ‘లాక్కో లాక్కో తాడు’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు లెక్క! ఇందులోను సన్నీ గెలవడంతో ప్రజలు తెగ ఆనందం చెందారు. సంబరాలు చేసుకున్నారు.
ఇక నేటి ఎపిసోడ్లో ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్కు బిగ్ బాస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ప్రియాంక ట్రాన్స్ జెండర్గా మారిన విషయం తన తండ్రికి తెలియదని ఈ మధ్య బిగ్ బాస్ షోలో చెప్పింది. ఇప్పుడు ఆ విషయం తండ్రికి తెలియగా, ఆయన స్వాగతించినట్టు తెలుస్తుంది. కాగా.. ప్రియాంక తండ్రి మాట్లాడిన వీడియో ప్లే చేయగా, అందులో సాయి తేజా అని అనడంతో.. ప్రియాంక బోరు బోరు ఏడ్వటాన్ని ప్రోమోలో చూపించారు.మిగతా హౌజ్మేట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.