ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీని ప్రశంసలతో ముంచెత్తేసింది అందాలభామ ప్రియాంక చోప్రా. ఇటీవల ముంబయ్ వేదికగా జరిగిన ‘మిస్ వరల్డ్ -2024’ వేడుకలో నీతా అంబానీ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకలో ప్రత్యేక వీడియో ద్వారా నీతా అంబానీకి ప్రియాంక శుభాకాంక్షలు అందించారు. ‘నేను చూసిన మంచి మనుషుల్లో నీతా అంబానీ ఒకరు.
ఏ పనిచేసినా అంకితభావంతో చేయడం ఆమె ప్రత్యేకత. నవ్వుతూ, పదిమంది జీవితాల్లో నవ్వులు పూయిస్తూ జీవించడం ఆమె జీవన విధానం. నేటి యువతకు ఆమె ఆదర్శం. ‘బ్యూటీ విత్ పర్పస్’ అన్న మాటకు సరైన ఉదాహరణ నీతా అంబానీ’ అంటూ ప్రశంసల జల్లు కురిపించింది ప్రియాంక చోప్రా. ఈ వేడుకలో చెక్ రిపబ్లిక్ నుంచి ప్రాతినిథ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.