Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్న విషయం తెలిసిందే. తాను హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో పార్ట్కు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు. 20 ఏళ్ల క్రితం ‘కోయీ మిల్ గయా’తో మొదలైన ఈ సిరీస్, ఆ తర్వాత ‘క్రిష్ 2’, ‘క్రిష్ 3’లతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఈ సినిమాల్లో హృతిక్తో పాటు అందాల తార ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్గా నటించగా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.
అయితే తాజాగా రాబోతున్న ‘క్రిష్ 4’లో ప్రియాంక చోప్రా మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. హృతిక్ రోషన్ ఈ మూవీ కథను ప్రియాంకకు వినిపించగా.. ఆమెను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రియా పాత్రలో ఆమె మెరవనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీమ్ నుంచి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుంటే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. క్రిష్ 4కి ఏకంగా రూ.20 నుంచి 30 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘SSMB29’ సినిమాకు కూడా ప్రియాంక దాదాపు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం.