Priyanka Chopra | ప్రియాంక చోప్రా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్, రాజమౌళి సినిమా షూటింగ్ మంగళవారం నుంచి హైదరాబాద్లో మొదలుకానున్నదని సమాచారం. అందులో భాగం కావడానికే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తున్నది. నిజానికి ఇప్పటికే ఓసారి ఈ సినిమా షూటింగ్లో ప్రియాంక పాల్గొన్నదట. మహేష్, ప్రియాంకలపై కొన్ని చిన్న చిన్న సీన్స్ రాజమౌళి తీశారని తెలుస్తున్నది. తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహం కారణంగా షూటింగ్కి గ్యాప్ ఇచ్చారు ప్రియాంక.
పెళ్లి హడావిడి పూర్తవ్వడంతో మళ్లీ ఆమె లొకేషన్కి తిరిగొచ్చారట. ఈ షెడ్యూల్లో మహేష్, ప్రియాంకలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి షూటింగ్ ఏప్రిల్ నుంచి కెన్యా అడవుల్లో మొదలుకానున్నది. వెయ్యికోట్ల భారీ బడ్జెట్తో నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్లో నానా పటేకర్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ఏ అధికారిక ప్రకటనా రాజమౌళి నుంచి రాకపోవడం గమనార్హం.