సోమవారం తన పుట్టిన రోజును జరుపుకుంది కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సందర్భంగా సరదాగా ఫ్యాన్స్తో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. తెలుగులో తాను నటించనున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘పవన్కల్యాణ్గారి ‘ఓజీ’ సినిమా చేస్తున్నా. అలాగే నాని ‘సరిపోదా శనివారం’ సినిమాలో కూడా నేనే హీరోయిన్. ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ కూడా డిస్కషన్ స్టేజ్లో ఉంది’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఫిలిం సర్కిల్స్ సమాచారం ప్రకారం ఆమె చెబుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏదో కాదు, గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం.
మైత్రీమూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ప్రియాంక నటించనున్నట్టు తెలిసింది. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారే? అనడిగితే ‘నేను తమిళమ్మాయిని. చదువుకుంది బెంగళూర్లో. చదువుకుంటూనే థియేటర్ ఆర్ట్స్లో పనిచేయటానికి ఆసక్తి చూపేదాన్ని. పలు నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఈ క్రమంలోనే తెలుగు కూడా నేర్చుకున్నాను. నా తొలి సినిమా‘గ్యాంగ్లీడర్’లో నేను డబ్బింగ్ చెప్పించుకోలేదు. అందులో నాది సొంత గొంతు. వచ్చే సినిమాల్లో కూడా నేనే డబ్బింగ్ చెప్పుకుంటా’ అని చెప్పింది ప్రియాంక