Actress Priyamani | రెండు దశాబ్దాల క్రితం ‘ఎవరే అతగాడు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. తొలి సినిమా డిజాస్టర్ కావడంతో ప్రియమణి లైమ్లోకి రాలేదు. ఆ తర్వాత మూడేళ్లకు జగపతి బాబుతో కలిసి ‘పెళ్లైన కొత్తలో’ సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ప్రియమణికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా ఎన్టీఆర్ పక్కన యమదొంగ చేసే చాన్స్ కొట్టేసింది. దెబ్బకు ప్రియమణి దశ తిరిగిపోయింది. వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. ఆ తర్వాత ‘నవ వసంతం’, ‘హరేరామ్’, ‘ద్రోణ’, ‘గోలిమార్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు తగిలాయి. అయితే గోలిమార్ తర్వాత ఈ అమ్మడుకి అస్సలు కలిసి రాలేదు. వరుస ఫ్లాపులు పలకరించాయి.
ఈ క్రమంలోనే తెలుగు అవకాశాలు కూడా తగ్గాయి. ‘చండీ’ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్లీ నారప్పతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అదరగొడుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రియమణి ‘కస్టడీ’ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లు జరుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా ప్రియమణి తన మనసులో మాటను బయటపెట్టారు. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించాను. కానీ చిరంజీవి గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆయనతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.
ఇక కస్టడీ సినిమాలో ప్రియమణి సీఎం పాత్రలో నటిచింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించింది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదలవుతుంది.