ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అభినందనీయంగా ఉంది. ఆమె బాలీవుడ్లో నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఏప్రిల్ 10న అజయ్దేవగణ్తో ఆమె నటించిన ‘మైదాన్’ కూడా విడుదల కానుంది. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా అమిత్శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఆసక్తికరంగా మాట్లాడింది ప్రియమణి. ‘కెరీర్ తొలినాళ్లలో ఏది తప్పో ఏది ఒప్పో తెలిసేది కాదు. వచ్చిన ప్రతి పాత్రకూ ఒప్పుకునేదాన్ని. ‘పరుత్తివీరన్’ నటిగా నా దృక్పధాన్ని మార్చింది. ఆ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాను. అప్పట్నుంచి స్వీయవిమర్శను అలవరచుకున్నాను. కొత్తగా చేయాలనే తపన మొదలైంది. కథలు ఎంచుకునే తీరు మారింది. ఇప్పుడు నా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నాను. నటిగా నా బాధ్యత మరింత పెరిగినట్టుగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. అజయ్దేవగణ్తో కలిసి ‘మైదాన్’లో నటించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది. అజయ్దేవగణ్ను ఓ అద్భుతంగా ఆమె అభివర్ణించింది. కళ్లతోనే అన్ని భావాలూ పలికించగల అద్భుతమైన నటుడు అజయ్దేవగణ్ అనీ, రేపు ‘మైదాన్’లో ఆయన్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని తెలిపింది
ప్రియమణి.