బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చాలా రసవత్తరంగా సాగుతుంది.ముఖ్యంగా ఎలిమినేషన్ అంశం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ నుండి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, వీరిలో ఐదుగురు మహిళా కంటెస్టెంట్స్ ఉన్నారు. తొలి మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్గగా, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ బయటకు వెళ్లాడు. ఆ తరువాత అయిదు, ఆరో వారం కూడా మళ్లీ ఫిమేల్ కంటెస్ట్ంట్ షో నుంచి ఎవిక్ట్ అయ్యారు.
ఇప్పుడు ఏడో వారం కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తుంది. ఈ వారం మొత్తంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, లోబో, ఆర్జే కాజల్, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఉన్నారు. వారిలో శ్రీరామచంద్ర, ఆర్జే కాజల్ ఇప్పటికే సేఫ్ అయ్యారు. మిగిలిన ఆరుగురిలో ప్రియ ఎలిమినేట్ కానుందని అంటున్నారు.
ప్రియ రీసెంట్ ఎపిసోడ్లో ప్రవర్తించిన తీరు ఆమెకి నెగిటివిటీని తెచ్చినట్టు పలువురు అభిప్రాయ పడుతున్నారు. సన్నీపై పూలకుండి ఎత్తడం, చెంప పగలగొడతా అనడం ఆమెకు మరింత నెగెటివిటీని తెచ్చిపెట్టిందని అంటున్నారు. బంగారు కోడిపెట్ట టాస్క్ సందర్భంలో గుడ్లను దొంగిలించడానికి వచ్చిన ప్రియను వీజే సన్నినెట్టేయగా, చెంప పగలగొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కొట్టుకునేంతవరకు వెళ్లింది వారిద్దరి మధ్య గొడవ.