‘తెలుగు ప్రేక్షకులు సినిమాను గొప్పగా ప్రేమిస్తారు. హైదరాబాద్లో షూటింగ్ చేయడం ఎప్పుడూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో నా సినిమాలన్నింటిని తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా’ అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన కథానాయకుడిగా నటించిన మలయాళీ చిత్రం ‘కడువా’ అదే పేరుతో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. షాజీ కైలాస్ దర్శకుడు. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. శనివారం టీజర్ను విడుదల చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ “కడువా’ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుంది. డబ్బింగ్ వెర్షన్ను అద్భుతంగా తీర్చిదిద్దాం. త్వరలోనే తెలుగు, మలయాళం పరిశ్రమల కాంబినేషన్లో పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయనే నమ్మకం ఉంది’ అన్నారు. ‘ఈ సినిమా ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య పోటీలా ఉంటుంది. ఈ కథను ఫోన్లో విని ఓకే చేశాను. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని వివేక్ ఒబెరాయ్ చెప్పారు. సంయుక్త మీనన్ మాట్లాడుతూ ‘తెలుగువారికి సినిమా అంటే ఓ పాషన్. ‘భీమ్లానాయక్’ టైమ్లో థియేటర్లో పండగ వాతావరణం కనిపించింది. ‘కడువా’ సినిమా థియేటర్స్లో కూడా అవే సెలబ్రేషన్స్ ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.