స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. ఈ నెల 12న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది.
తొలి షెడ్యూల్ను జెట్ స్పీడ్లో పూర్తి చేశారు. 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. స్టంట్ కొయోగ్రాఫర్స్ అన్బు అరివు సారథ్యంలో ఈ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ‘హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులతో తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. దసరా పండుగ తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్, సంగీతం : థమన్.