Mahesh Babu-Trivikram Movie | ‘అల వైకుంఠపురం’లో తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మహేష్తో ‘SSMB28’ తెరకెక్కిస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసికల్ హిట్ల తర్వాత వీళ్ళ కాంబోలో మూడో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కొన్ని రోజులు షూటింగ్ను ఆపేశారు. కాగా డిసెంబర్ రెండు లేదా మూడో వారం నుండి తదుపరి షెడ్యూల్ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.
త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. అంతేకాకుండా ఈయన సినిమాల్లో సెకండ్ హీరో, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రీలీల దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. కాగా తాజాగా సెకండ్ హీరోకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోగా సాయి రోనాక్ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘పాఠశాల’, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి రోనాక్. కాగా ‘SSMB28’లో కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ ఈయనను సంప్రదించాడట. సాయి రోనాక్ కూడా వెంటనే ఓకే చేశాడట.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక& హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడట.