Premalu 2 | మలయాళ సెన్సేషనల్ హిట్ ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘ప్రేమలు 2’ అంటూ ఈ సీక్వెల్ రాబోతుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ రద్దయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం తాజాగా స్పందిస్తూ.. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోలేదని కేవలం తాత్కాలికంగా వాయిదా పడిందని స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్లో ఎంతో గ్రాండ్గా ప్రకటించిన ఈ సీక్వెల్ను 2025లో ఏడాది విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది 2026 సమ్మర్కి పోస్ట్పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చిత్ర దర్శకుడు గిరీష్ ప్రస్తుతం మమితా బైజు, నివిన్ పాలీలతో కలిసి ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ అనే మరో ప్రాజెక్ట్లో బిజీగా ఉండటం కూడా ఒక కారణమని తెలుస్తుంది. తెలుగులో ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ ‘భావన స్టూడియోస్’ నుండి ఈ పుకార్లపై ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.