నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నాగచైతన్య.. జుంబా కోచ్. .. రేవంత్ పాత్రలో .. సాయి పల్లవి మౌనిక పాత్రలో నటించి మెప్పించారు. గత రెండెళ్లుగా థియేటర్లకు దూరంగా ఉంటున్న ఆడియన్స్ను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించడంలో లవ్ స్టోరీ చిత్రం సక్సెస్ అయింది.
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. లవ్ స్టోరీ సినిమా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇక సాయి పల్లవికి మలయాళంలో మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో లవ్ స్టోరీ చిత్రాన్ని కేరళలో ప్రేమ తీరం పేరుతో అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా పోస్టర్ విడుదల చేస్తూ తెలియజేశారు.