త్రిగున్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశం’. సీనియర్ నటి మధుబాల ప్రత్యేకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సిద్దమ్ దర్శకుడు. శిరీష సిద్దమ్ నిర్మాత. ఇటీవల ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘1996లో విడుదలైన ప్రేమదేశం సినిమా అప్పట్లో యువతను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే టైటిల్తో వస్తున్న మా చిత్రం కూడా ఆ టైటిల్ గౌరవాన్ని కాపాడే విధంగా ఉంటుంది. మా చిత్రానికి ప్రమఖ సంగీత దర్శకుడు మణిశర్మ అద్భుతమైన బాణీలను అందించాడు. పూర్తి వినోదాత్మకంగా కాలేజ్ నేపథ్యంలో రూపొందుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.