ప్రేమదేశం (Prema Desam)…అబ్బాస్, వినీత్, టబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కోలీవుడ్ డైరెక్టర్ కతిర్ (Kathir) , ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) కలయికలో వచ్చి..బాక్సాపీస్ ను షేక్ చేసింది ప్రేమ దేశం. మళ్లీ 19 ఏళ్ల తర్వాత కతిర్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తమిళ నిర్మాత ఎన్ రంగనాథన్ కుమారుడు కిశోర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కతిర్.
ఆర్ కే ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని చెన్నై, ముంబై, బెంగళూరుతోపాటు విదేశాల్లో షూట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. కతిర్ దర్శకత్వంలో వచ్చిన ఇధయమ్, నాన్ లవ్ ట్రాక్ సినిమాలు మినహా మిగిలిన చిత్రాలన్నింటికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం విశేషం.
కథిర్, రెహమాన్ కాంబోలో వచ్చిన ప్రేమ దేశం, ప్రేమికుల రోజు చిత్రాల నుంచి వచ్చిన హిట్ ఆల్బమ్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. వీరిద్దరూ కలిసి 2002లో వచ్చి కాదల్ వైరస్ సినిమాకు చివరిసారిగా పనిచేశారు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!