Santosh Shoban | సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శివప్రసాద్ పన్నీరు నిర్మాత. రాశీ సింగ్, రుచిత సాదినేని కథానాయికలు. ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటుంది. యువతరాన్ని మెప్పించే అన్ని అంశాలుంటాయి’ అన్నారు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘నటుడిగా నన్ను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. హాస్య ప్రధానంగా అన్ని వర్గాలను అలరిస్తుంది. ప్రేమ్కుమార్ లవ్ కహానీ అందరికి కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు.