Dil Se Movie | బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ (Shahrukh khan), మనీషా కొయిరాలా(Manisha Koiraala), ప్రీతి జింటా (Preity Zinta) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘దిల్ సే’ (Dil se 1998). ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాతోనే ప్రీతి జింటా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా విషయాలను గుర్తు చేసుకుంటూ.. 26 ఏండ్ల తర్వాత ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది.
ఈ ఫొటోను ‘దిల్ సే’ మూవీ సెట్లో మొదటి రోజు తీశారు. ఈ సినిమాలో అవకాశం రాగానే మణిరత్నం సర్, షారుఖ్ ఖాన్లతో పని చేయడానికి ఆత్రుతగా ఎదురు చూశా. మణి సార్ నన్ను ఫస్ట్ చూడగానే నా దగ్గరకి వచ్చి ముఖం కడుక్కొని రమ్మని నవ్వుతూ చెప్పారు. అయితే నేను జోక్ చేస్తున్నారనుకున్నా. సార్… నా మేకప్ పోతుంది అన్నాను. నాకు కూడా కావలసింది అదే.. దయచేసి మీ ముఖం కడుక్కోండి అన్నాడు. దీంతో మేకప్ తీసేశాను. ఆ తర్వాత తీసిన క్లోజప్ షాట్ అద్భుతంగా వచ్చింది. ఈ ఫొటో నా తొలి సన్నివేశంలోనిది. ఇంత అందమైన ఫొటో తీసిన మా ఫొటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్కు ధన్యవాదాలు అంటూ ప్రీతి జింటా రాసుకోచ్చింది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA
— Preity G Zinta (@realpreityzinta) February 8, 2024