Preity Zinta | మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ఖాన్, ప్రీతిజింతా జంటగా నటించిన ‘దిల్సే’ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారానే ప్రీతిజింతా బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. తన తాజా ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్లో ఈ సినిమా తాలూకు జ్ఞాపకాల్ని నెమరేసుకుంది ప్రీతి జింతా. ఓ సన్నివేశంలో మేకప్ లేకుండా నటించానని, దర్శకుడు మణిరత్నం పొయొటిక్ విజన్కు ఆ సీన్ ఓ ఉదాహరణగా నిలిచిందని చెప్పింది. ఈ సందర్భంగా అలనాటి ఫోటోను షేర్ చేసింది.
“దిల్సే’ తొలి రోజు షూటింగ్ సందర్భంగా తీయించుకున్న ఫొటో ఇది. ఆ రోజు సీన్ కోసం సిద్ధమయ్యే సమయంలో మణిరత్నంగారు నన్ను పిలిచి ముఖం కడుక్కొని రమ్మన్నారు. ‘అలా అయితే మేకప్ మొత్తం పోతుంది కదా సర్’ అని కాస్త భయంగానే చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు.. ఈ సీన్లో మేకప్ లేకుండానే కనిపించాలి’ అని మణిరత్నం సర్ అన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఆ సీన్ను తెరపై చూసుకుంటే మణిరత్నంగారి క్రియేటివ్ విజన్ అర్థమైంది’ అంటూ అప్పటి సంఘటనను గుర్తుచేసుకుంది ప్రీతిజింతా. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో పాటు లాస్ఏంజిల్స్లో స్థిరపడింది. సన్నీ డియోల్ ‘లాహోర్ 1947’ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్లో పునరాగమనం చేస్తుందనే వార్తలొస్తున్నాయి.