ప్రతాప్, శ్రీరామ్, అనురాధ, చెల్లి స్వప్న, మంజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఓ తండ్రి తీర్పు’. ఈ చిత్రాన్ని లయన్ అరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో ఏవీకే ఫిలింస్ పతాకంపై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్నారు. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ..‘తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజెప్పే చిత్రమిది. సందేశాత్మకంగా ఉంటూ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. దర్శకుడు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ…‘ఇవాళ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం పెరుగుతున్నది. వారి మధ్య అనుబంధాలు, ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంతో సినిమాను రూపొందిస్తున్నాం’ అన్నారు.