తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ చైర్మన్గా మరోసారి ప్రతాని రామకృష్ణగౌడ్ నియమితులయ్యారు. టీఎఫ్సీసీ నూతన కార్యవర్గ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా ఆర్కేగౌడ్, వైస్చైర్మన్లుగా గురురాజ్, డి.కోటేశ్వరరావు, నెహ్రూ, సెక్రటరీలుగా సాయివెంకట్, జె.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేవాళ్లం. కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఆలస్యమైంది. ఈసారి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా సభ్యుల ఎంపిక జరిగింది. త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తాం’ అని తెలిపారు. మరోసారి తాను వైస్చైర్మన్గా ఎన్నికకావడం ఆనందంగా ఉందని గురురాజ్ చెప్పారు.