ఓ డబ్బింగ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. యష్ అనే హీరోతో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
త్వరలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్లతో సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, తాజాగా ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యాడు. చరణ్.. ప్రశాంత్ నీల్ని తన ఇంటికి ఆహ్వానించగా ఆ సమయంలో చిరంజీవితో కలిసి ప్రశాంత్ నీల్, చరణ్ ఫొటో దిగారు. ఈ పిక్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరుని కలవడంతో చిన్ననాటి కల నెరవేరినట్టుగా తెలియజేశాడు. కాగా, ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. దీనికి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ ను అనుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.