Prasanna Vadanam | యువ హీరో సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తుండగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. సుహాస్ ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుపడతారు. అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.