Pranitha | కథానాయిక ప్రణీత ఇటీవల తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత సంవత్సరం ఇలాంటి ఫోటోస్ పోస్ట్ చేయగానే ఆమెకు నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి అలాంటి విమర్శలు రాకుండా ముందే అందరికి గట్టి సమాధానం ఇచ్చింది ప్రణీత.
‘భీమన అమవాస్య సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా నా భర్తకు పాదపూజ చేశాను. గతేడాది ఈ విషయంలో నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా విమర్శించిన వారికి ఇది పితృస్వామ్యంలో భాగంగా కనిపిస్తుందేమో.. నాకు మాత్రం ఈ పూజ సంప్రదాయంలో ఓ భాగంలా కనిపిస్తుంది. దీనికి ఎంతో ప్రాముఖ్యత వుంది’ అంటూ పోస్ట్ చేసింది ప్రణీత.