విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ సారి జరగనున్న మా ఎలక్షన్స్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్కి పోటీగామంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, జీవితా రాజశేఖర్ ,హేమ,కాదంబరి కిరణ్ పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్ధులు పలు రకాలుగా ప్రచారాలు మొదలు పెట్టేశారు.
అయితే మా ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్ బర్త్డేని పురస్కరించుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం నైట్ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. నాగార్జున బర్త్డే సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఆఫీసులో జరిగే సెలబ్రెషన్స్కు నాలుగు సీజన్ల బిగ్బాస్ కంటెస్టెంట్స్ హాజరు కావాల్సిందిగా వాట్సప్ గ్రూప్లో సమీర్ ఇన్విటేషన్ పంపినట్టు సమాచారం.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని కలిపి ఓ గ్రూప్ ఏర్పాటు చేయగా, ఆ గ్రూప్లో మొదటి బిగ్ బాస్ కంటెస్టెంట్ సమీర్ ..డియర్ బిగ్బాస్ మేట్స్ కింగ్ నాగార్జున సర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు సీజన్ల బిగ్బాస్ కంటెస్టెంట్స్ కలుద్దాం. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నాలుగు సీజన్ల వారు ఇలా కలవడం అరుదు. ఈ రోజు రాత్రి ఏడు గంటల నుంచి సంబరాలు షురూ అని పోస్ట్ పెట్టాడు. దీనిని బట్టి చూస్తుంటే నాగ్ బర్త్ డే సెలబ్రేషన్స్తో పాటు మా ఎన్నికల ప్రచారం రెండు ఈ పార్టీతో కవర్ అవుతుందని భావిస్తున్నారు.
మా సభ్యులని ప్రసన్నం చేసుకునేందుకు ప్రకాశ్ రాజ్ ఈ దారిలో వెళుతుంటే మిగతా పోటీ దారులు ఎలాంటి స్కెచ్లు వేస్తారా అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఆరుగురు మా అధ్యక్ష బరిలో నిలవబోతున్నారు. ఈ ఆరుగురిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతుందనే చర్చ నడుస్తుంది.