టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం గురించి గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు రాగా, దీనిపై అక్టోబర్ 2న క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోతోన్నామని కానీ, స్నేహితుల్లా కలిసి ఉంటామని సమంత, నాగ చైతన్య పేర్కొన్నారు. విడిపోయేటప్పుడు కూడా ఇద్దరూ ఒకే రకమైన పోస్ట్ చేశారు.
ఏం మాయ చేశావే’ మూవీతో స్నేహితులైన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో.. దీనికి కారణాలేంటని సోషల్ మీడియాలో నెటిజనులు చర్చించుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు వీరి విడాకుల విషయంపై తమ స్పందన తెలియజేస్తున్నారు.
తాజాగా ప్రకాశ్ రాజ్.. నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోవడం నిజంగా బాధాకరం. నేను కూడా గతంలో ఓ సారి విడాకులు తీసుకున్నాను. ఆ బాధేంటో నాకు తెలుసు. చాలా ప్రేమించి ఒక్కటై, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం అనేది భరించలేని నొప్పి. వేరే దారి లేక వారు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నా. ఇది వారి పర్సనల్ అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.