మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ జోరు పెంచారు. మా ఎన్నికల్లో తనకు పెద్దల ఆశీర్వాదం వద్దన్న ఆయన.. తన సత్తాతోనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పెద్దోళ్లను ప్రశ్నించే సత్తా ఉన్నవారే అధ్యక్షుడిగా గెలవాలి. ఒకరి కృపాకటాక్షలతో వస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
తెలుగువాడు కాదన్న నరేశ్ వ్యాఖ్యలపై ప్రకాశ్రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్లో ఎవరికి రాదు అని చురకలంటించారు. తనను పెంచింది తెలుగు భాషే అని ప్రకాశ్రాజ్ స్పష్టం చేశారు. నరేశ్ అహంకారి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. మా సిగ్గుపడేలా నరేశ్ ప్రవర్తిస్తున్నారు. కోపం, బాధతో వేసే ఓటు సునామీలో విష్ణు కొట్టుకుపోవాలి. తాము ప్రశ్నించకపోతే ఈసారి ఎన్నకిలు ఉండేవి కావు. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే తనను బెదిరించారు. తాను ఒక ఉత్తరం రాస్తే మా కార్యాలయానికి తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తనకు తెలుసన్నారు ప్రకాశ్ రాజ్.