మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ జంటగా దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త ప్రేమకథా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఈ రోజేదో..’ లిరికల్ సాంగ్ను హీరో ప్రదీప్ మాచిరాజు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటను అషీర్ లూక్ స్వరకల్పనలో డాక్టర్ వాసుదేవ్ సాహిత్యాన్ని అందించగా…ఆషిక్ అలీ, సోనీ కొమండూరి పాడారు. ప్రేమికుడి మనసులోని ప్రణయ భావాలను పలికిస్తూ సాగిందీ పాట. ఈ సందర్భంగా ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ..‘మంచి కాన్సెప్ట్తో ఈ పాటను తెరకెక్కించారు. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నా’ అన్నారు.