యాంకర్ ప్రదీప్ పెద్దగా వివాదాల జోలికి పోడు. కాని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రదీప్కు లేని పోని చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అంటూ వ్యాఖ్యలు చేయగా వాటిని సరిదిద్దుకోవాలని అంతేకాకుండా క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ క్షమాపణలు చెప్పని పక్షంలో తన ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస రావు తెలిపాడు.
ప్రదీప్ వ్యాఖ్యలు రైతులు, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఇలా వ్యవహరిస్తే మరోలా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. కాగా, ప్రదీప్ ఇటీవల తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు.ఆయన ప్రస్తుతం బుల్లితెర షోస్తో బిజీగా ఉన్నాడు. ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.