డ్యాన్స్మాస్టర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న కిడ్స్ఫాంటసీ చిత్రం ‘మై డియర్ భూతం’ ఎన్.రాఘవన్ దర్శకుడు. తమిళంలో రమేష్ పి.పిైళ్లె నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇటీవల ఈ చిత్రంలోని మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్బీట్తో కొనసాగే సాంగ్ను విడుదల చేశాం. అన్ని వర్గాలను అలరించే ఈ చిత్రంలో పిల్లలను అలరించే అంశాలు కూడా వున్నాయి. చిత్రంలో వుండే సందేశం కూడా అందరికి నచ్చే విధంగా వుంటుంది’ అన్నారు.