అగ్ర కథానాయకుడు ప్రభాస్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘బాహుబలి’ సిరీస్తో పాన్ఇండియా హీరోగా ఇమేజ్ను సంపాదించుకున్న ఆయన గత ఏడాదిగా భారీ చిత్రాల్ని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్మీదున్నాయి. తాజాగా ప్రభాస్ 25వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘అర్జున్రెడ్డి’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భూషణ్కుమార్ నిర్మాత. ఇప్పటివరకు భారతీయ తెరపై రానటువంటి వినూత్న యాక్షన్ కథాంశంతో పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ‘ఆది పురుష్’ ‘సలార్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.