స్టార్ హీరోల సినిమాలను వీలైనంత త్వరగా తెరపై చూసేయాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. ఆ సినిమాల గురించి కొత్త విషయాల కోసం వేచి చూస్తుంటారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కే ప్రభాస్ సినిమాలు సహజంగానే విడుదలకు ఆలస్యమవుతుంటాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తరుచూ చిత్ర దర్శక నిర్మాతలను సినిమా గురించి చెప్పమని అడుగుతుంటారు. వీరి కోసం ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు ‘ఆదిపురుష్’ చిత్ర దర్శకుడు ఓం రావత్.
సినిమా ప్రస్తుతం త్రీడీ ఫార్మేట్లోకి మారుస్తున్నారు. అమెరికాలోని లాస్ఎంజెలీస్ ఐమాక్స్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఓం రావత్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆదిపురుష్ పనులు పూర్తి దశకు వచ్చాయి. ప్రభాస్ అభిమానులకు నేనిచ్చే పెద్ద అప్ డేట్ ఇదే. సినిమా విడుదల కోసం నేనూ వేచి చూస్తున్నా’ అన్నారు. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.