Prabhas | ‘కల్కి’ చిత్రంతో వరల్డ్వైడ్గా బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్’ ‘ఫౌజీ’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాలో జాయిన్ అవుతారు. ‘యానిమల్’ వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ను పోషించనున్నారని, రణబీర్కపూర్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుండగా.. తాజా ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరులో సినిమాను సెట్స్మీదకు తీసుకెళ్తామని, ఆరు నెలల వ్యవధిలో షూటింగ్ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీనిని బట్టి వచ్చే దసరా కల్లా ‘స్పిరిట్’ విడుదలకు సిద్ధంగా ఉంటుందని అభిమానులు ఆంచనా వేస్తున్నారు. ‘స్పిరిట్’ పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి షూటింగ్ను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, పోస్ట్ప్రొడక్షన్స్కు కూడా అంతగా సమయం పట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.