వృత్తిని తాను ఎంతగానో ప్రేమిస్తానని, పని లేకుండా ఖాళీగా ఉంటే ఏదో కోల్పోయాననే భావన కలుగుతుందని చెప్పింది చెన్నై సోయగం శృతిహాసన్. సినిమాలతో పాటు గాయనిగా ప్రతిభను చాటుతూ కెరీర్లో దూసుకుపోతున్నదీ భామ. ఇటీవల ‘బెస్ట్సెల్లర్’ అనే వెబ్షోలో కూడా భాగమైంది. మూడు భిన్న వేదికలపై రాణించడం గురించి శృతిహాసన్ మాట్లాడుతూ ‘సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్పై కూడా దృష్టిపెడుతున్నా. ఇక సంగీతం నా జీవితంలో ఓ భాగమైంది. సొం తంగా ఆల్బమ్స్ చేసుకుంటున్నా. ఇన్ని వ్యాపకాలు ఉన్నా ఎప్పుడూ విశ్రాంతి కోసం తపించలేదు. నాకు పనిలేకపోతే బోర్ కొడుతుంది. ఏదో తప్పుచేశానని అపరాధ భావనతో సతమత మవుతాను.
అందుకే ఒక్కరోజు కూడా వృథా చేయను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ మాధ్యమాల ప్రభావం పెరిగిపోతున్నదని, సోషల్మీడియాలో సినిమాలకు లభించే ప్రచారం కూడా విజయాల్ని నిర్ణయిస్తున్నదని ఆమె తెలిపింది. ‘సినిమా విజయానికి వసూళ్లను ప్రామాణికంగా తీసుకోవచ్చు. అదే ఓటీటీల విషయంలో సోషల్మీడియాలో జరిగిన ప్రచారాన్నే కొలమానంగా తీసుకుం టున్నారు. సామాజిక మాధ్యమాల్లో కంటెం ట్ విస్త్రతంగా షేర్ అయితే దానికి విజయం దక్కినట్ల్లే’ అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్ సరసన ‘సలార్’చిత్రంలో నటిస్తున్నది.