బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ను దాటి యూనివర్సల్ స్టార్గా మారిపోయాడు ప్రభాస్ (Prabhas). ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా స్టోరీలే. ప్రస్తుతం పూజాహెగ్డే (Pooja Hegde)తో కలిసి యూనివర్సల్ ప్రేమకథాంశంతో పాన్ ఇండియా ప్రాజెక్టు రాధేశ్యామ్ లో నటిస్తున్నాడు. రాధేశ్యామ్తోపాటు ఆదిపురుష్, ప్రాజెక్టు కే, సలార్ సినిమాలున్నాయి. మార్చి 11న రాధేశ్యామ్ (Radhe Shyam) వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు ప్రభాస్.
తన సినిమాలు, ఆహారపు అలవాట్లు, అతిథులను చూసుకునే విధానం, ఇతర అంశాల గురించి పలు విషయాలు పంచుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా సినిమాల కోసం కథ ఎంపిక చేసుకునే విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగిన కథలు ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అందువల్లే సినిమాల ఎంపికలో ఆలస్యమవుతుంటుందని చెప్పాడు.
ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. నాన్న, పెద్దనాన్నతో పోల్చుకుంటే నేను ఎక్కడా ఉండను. ఈ అవకాశాన్ని వారి దగ్గర నుంచి పొందాను. మా పెద్దనాన్న ముంబై నుంచి వచ్చే చాలా మంది అతిథులకు మంచి భోజనం పెట్టేవారు అంటూ గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. చాలా కాలం తర్వాత బాహుబలితో తెలుగు సినిమా ఇండియా దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్.