Prabhas | సాధారణంగా సినిమా షూటింగ్స్లో ఫైట్ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు దర్శక నిర్మాతలు. అలాగే ఫైట్ మాస్టర్స్ కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కోసారి అనుకోకుండా కొన్ని షాకింగ్ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభాస్ కెరీర్లో కూడా ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి ఘటనే జరిగింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ మొదటిసారి నటించిన ఛత్రపతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 27 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. వర్షం సినిమాతో క్రేజీ హీరోగా మారినా చత్రపతితోనే ఈయనకు మాస్ ఇమేజ్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చూసి ప్రభాస్ అభిమానులు ఊగిపోయారు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్లో కాట్రాజ్ను మొదటిసారి కొట్టే సన్నివేశం తెలుగు ఇండస్ట్రీలోనే ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ల్లో ఒకటిగా నిలిచిపోయింది. లైన్ దాటుతూ ఇక చాలు అంటూ ప్రభాస్ అరుస్తుంటే థియేటర్లో ప్రేక్షకులకు పూనకం వచ్చింది. ఇప్పుడు ఆ యాక్షన్ సన్నివేశం గురించి రాధే శ్యామ్ ప్రమోషన్స్లో మరోసారి గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. ఛత్రపతి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన రవీందర్.. ఇప్పుడు ఈ సినిమాకు కూడా పనిచేశాడు. ఆయన పనితనం గురించి చెబుతూ చత్రపతి లొకేషన్లో జరిగిన అరుదైన సంఘటన గుర్తు చేసుకున్నాడు రెబల్ స్టార్.
సముద్రం దగ్గర చేసే ఫైట్ సన్నివేశంలో విలన్ చేతికి సముద్రం ఉప్పుతో చేసిన కర్ర ఇచ్చారు. కానీ ఆ విషయం చెప్పలేదు. అది తెలియక విలన్ సుప్రీత్.. ప్రభాస్ను బలంగా కొట్టాడు. దాంతో తన వీపు పగిలి పోయిందని.. ఎందుకు నిజమైన కథ ఇచ్చారు అంటూ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ను ప్రభాస్ అడిగితే అడిగితే పర్ఫెక్షన్ కోసం అంటూ సమాధానం చెప్పాడట. ఈ విషయాన్ని రాధేశ్యామ్ ప్రమోషన్లో గుర్తుచేసుకుని నవ్వుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఏకంగా 101 సెట్స్ వేశాడని చెప్పుకొచ్చాడు. దాదాపు 175 కోట్ల బడ్జెట్తో రాధే శ్యామ్ సినిమా వస్తుంది.