Prabhas Project-K Movie Shooting | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే వచ్చిన ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. ‘సాహో’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు డార్లింగ్ను వెండితెరపై చూడబోతున్నామని ఆశతో వచ్చిన అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్పై ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ఈ షెడ్యూల్లో ప్రభాస్-దీపికాలపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా కాస్ట్ అండ్ క్రూతో కలిపి వందలాది మందితో ఈ షెడ్యూల్ జరుగుతుందట. ఇప్పటికే ప్రభాస్ ఇంట్రో షూటింగ్ పూర్తయినట్లు నాగ్ అశ్విన్ ఇటీవలే చెప్పాడు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సై-ఫై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.
ఇక ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. దీనితో పాటుగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకుందట.