ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ కథానాయిక. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్, కమల్హాసన్ వంటి దిగ్గజ నటులు భాగమయ్యారు. పురాణేతిహాసాల నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. ప్రభాస్, కమల్హాసన్లపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరిపై తెరకెక్కించిన ఘట్టాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. ఇక ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది.