Nidhhi Agerwal | బెంగళూరు సోయగం నిధి అగర్వాల్కు యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఈ భామ పవన్కల్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో బంపరాఫర్ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో పీరియాడిక్ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇందులో నిధి అగర్వాల్ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, గత చిత్రాలకు భిన్నంగా ఆద్యంతం వినోదంతో ఆకట్టుకునే చిత్రమిదని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో నిధి అగర్వాల్ త్వరలో జాయిన్ కాబోతున్నట్లు తెలిసింది.