భారీ పాన్ ఇండియా లైనప్లతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆయన సినిమాలు కూడా వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్కు అంగీకారం తెలిపినట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ చిత్రానికి ఓకే చెప్పినట్లు గతంలోనే వెల్లడవగా..ఇప్పుడు ఆ సినిమా నేపథ్యం, చిత్ర నిర్మాణ సంస్థ వివరాలు కూడా బయటకు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నదనీ, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది.
మరోవైపు ప్రభాస్తో దర్శకుడు త్రివిక్రమ్ కూడా సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ ప్రభాస్కు కథ వినిపించాడని అంటున్నారు. ప్రభాస్ ఇమేజ్కు సరికొత్తగా ఉండే ఈ కథతో సినిమా రూపొందనుందట. ఈ రెండు ప్రాజెక్ట్స్ గురించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’ తదితర సినిమాల్లో నటిస్తున్నారు.