బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన గురించి ఎవరైన తప్పుగా కామెంట్ చేసిన లేదంటే ప్రభాస్కి సంబంధించిన ఏదైన విషయంలో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆదిపురుష్ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించిన సన్నీ సింగ్.. ప్రభాస్ అభిమానుల ముందు అడ్డంగా బుక్కయ్యాడు.
పాన్ ఇండియా రేంజ్ సంపాదించినా కూడా ప్రభాస్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు మాత్రమే వాడుతున్నాడు. ట్విట్టర్కి ఇంకా దూరంగానే ఉన్నాడు. అయితే సన్నీ సింగ్ రీసెంట్గా ప్రభాస్ తో దిగిన ఫొటోను షేర్ చేసి , పెద్దన్నతో పని చేయడం గొప్పగా ఉంది. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ ప్రభాస్ పేరుతో ఉన్న అకౌంట్ ట్యాగ్ చేశాడు. ట్విట్టర్ అకౌంట్ ఉన్న వారిని మాత్రమే ట్విట్టర్ లో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ప్రభాస్ కు ట్విట్టర్ లో అకౌంట్ లేదు.
ప్రభాస్ పేరు మీద కొన్ని వేల ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ప్రభాస్ అనే పేరు కొట్టగానే వచ్చిందని ఆ అకౌంట్ ను సన్నీ సింగ్ ట్యాగ్ చేశాడు. ఆ తర్వాత కూడా సన్నీ సింగ్ చూసుకోలేదు. ఇంత నిర్లక్ష్యం ఏంటీ సన్నీ అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్కి ట్విట్టర్ అకౌంట్ ఉందో లేదో కూడా తెలియదా, తెలుసుకోవాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న సన్నీ సింగ్ కు ఆదిపురుష్ లో లక్ష్మణుడి పాత్ర దక్కింది.