Adipurush | రీసెంట్గా మైథలాజికల్ డ్రామా ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Adipurush)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ఓ వైపు విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఆదిపురుష్ కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకుపైగా రాబట్టింది. బాహుబలి ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్గా మారిపోయిన ప్రభాస్ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. అది కూడా ప్రభాస్ వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా ఈ అరుదైన రికార్డును నమోదు చేయడం విశేషం.
ఇంతకీ విషయమేంటనే కదా మీ డౌటు. బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాల తర్వాత యూఎస్ఏలో 3 మిలియన్ డాలర్ మార్క్ దాటిన నాలుగో చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో రాంచరణ్ ఖాతాలో రెండు సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు నటించిన ఒక్కో సినిమా యూఎస్ఏలో 3 మిలియన్ డాలర్ మార్క్ చేరుకున్న సినిమాల జాబితాలో ఉన్నాయి. ఈ ఫీట్ (3 మిలియన్ డాలర్ మార్క్ దాటిన)ను చేరుకున్న తొలి టాలీవుడ్ హీరో కావడంతో ప్రభాస్ అభిమానులు సంతోషంలో ఎగిరి గంతేస్తున్నారు.
పురాణేతిహాసం రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కిన ఆదిపురుష్కు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్ర పోషించింది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణాసురుడి (లంకేశ్)గా సైఫ్ అలీఖాన్, హనుమంతుడి పాత్రలో దేవ్దత్తా నగే నటించారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందించారు.
ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్..