Prabhas-Maruthi Movie | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి ఫోకస్ను పెట్టాడు. అయితే ప్రభాస్ తన మోకాలు సర్జరీ కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. గాయం తగ్గడంతో ఇటీవలే ‘ప్రాజెక్ట్-K’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యుల్ పూర్తవ్వగానే ‘సలార్’ బిగ్ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ప్రభాస్- మారుతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. సూపర్ నాచ్యురల్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రం ఆగస్టులో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక మొదటి షెడ్యుల్లో ప్రభాస్, మళవికా మధ్య సన్నివేశాలు తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రభాస్ 100రోజులు కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. ఇక ఈ చిత్రం కోసం మేకర్స్ హైదరాబాద్లో ఒక పెద్ద బంగ్లా సెట్ను వేశారని టాక్. ఈ చిత్రంలో మాళవికతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఈ చిత్రానికి రాజా డిలక్స్ అనే పేరును పరిశీలనలో ఉంచారు.
ప్రభాస్ ప్రస్తుతం నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘తన్హాజీ’ ఫేం ఓ రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. వీటితో పాటుగా ప్రభాస్, సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.